అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మరో చిత్రం రానుంది. "పుష్ప-2" వంటి మాస్ యాక్షన్ మూవీ తర్వాత అదే జానర్లో వస్తుందని భావించారు. అయితే, ఈ ప్రాజెక్టుపై తాజాగా నిర్మాత నాగవంశీ ఓ కీలకమైన విషయాన్ని వెల్లడించారు.
ఇక ఈ సినిమాలో బన్ని.. కుమారస్వామిగా కనిపిస్తారంటూ గత కొంతకాలంగా ప్రచారం సాగుతుంది. ఇపుడు నాగవంశీ కూడా మైథలాజికల్ జానర్ అని చెప్పడంతో బన్ని లుక్ ఎలా ఉంటుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు, ఎక్స్లోనూ ఈ హీరో కుమార్ స్వామిగా ఉన్న జిబ్లీ ఇమేజ్లు ట్రెండ్ అవుతున్నాయి.