గోపీచంద్ తో సినిమా చేస్తున్న టైంలో నిర్మాత వంశీ వచ్చి ప్రభాస్ తో సినిమా చేస్తావా? అని అడిగాడు. గోపీచంద్ తో చేశాను ప్రభాస్ ఎందుకుచేయను అన్నా. అయితే ముంబై రమ్మన్నాడు. వెళ్ళి కలు అని చెప్పారు. అలా ప్రభాస్ ను కలిస్తేనే గాడ్ తో కలిసినట్లుగా వుంది. ఆయన నా సినిమాలు ప్రేమకథా చిత్రమ్, భలే భలే మగాడివేయ్.. లకు పెద్ద ఫ్యాన్. ఆ తరహా సినిమా చేయాలని చెప్పారు. అలాగే చేద్దాం అండీ.. అన్నా. అండీ కాదు. డార్లింగ్ అను అంటూ నాకు చెప్పారు.
నేను ఓ సినిమాను చేయాలనుకున్నా. కానీ ఆ నిర్మాత మధ్యలో వెళ్ళిపోయాడు అని వంశీకి చెప్పా. ఇలాంటి టైంలో నేను చేయలేను అని అన్నా. ఆ రోజు సాయంత్రం ప్రభాస్ నుంచి ఫోన్ వచ్చింది. నేను అంతకుముందు చెప్పిన సీన్ల గురించి ప్రభాస్ చర్చించారు. వెంటనే రెండు రోజులు టైం కావాలి అని అడిగా. అలా నా గురించి అంతా ఆలోచిస్తున్నా ప్రభాస్ కోసం మరోసారి కలానికి పదును పెట్టి కొత్తగా రాయడం మొదలు పెట్టా. అలా తయారైందే రాజాసాబ్ అని మారుతీ చెప్పారు.
ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. ఫ్యాన్సే కాదు. ఇండస్ట్రీనేకాదు. మా ఇంటిలో వారు కూడా ప్రభాస్ తో సినిమానా? నువ్వు చేయగలవా? అని అడిగారు. అలాంటి ప్రశ్నే ప్రభాస్ కు ఎదురైంది కూడా. వారికి ప్రభాస్ ఇచ్చిన సమాధానం నన్ను ఎంతగానో ఇన్ స్పైర్ చేసింది. మీరందరూ చూడనిది ఆయనలో సరికొత్త కోణం టాలెంట్ నేను చూశాను అని చెప్పారు. అందుకే చాలా కసితో రాజా సాబ్ రూపొందిస్తున్నాను. ఇంకా కొంత వర్క్ వుంది. త్వరలో మరో రెండు పాటలు కూడా తీయాలి. ఫ్యాన్స్ మెచ్చుకునే సినిమా తప్పకుండా అవుతుంది. ఇప్పటికే టీజర్ కు అనూహ్య స్పందన వచ్చింది అని తెలిపారు.