వైఎస్ఆర్‌సిపి 0-175 రావచ్చు, ఇదే యాక్యురేట్ ఫిగర్ అంటున్న రాంగోపాల్ వర్మ

ఐవీఆర్

సోమవారం, 3 జూన్ 2024 (11:06 IST)
రాంగోపాల్ వర్మ. ఆయన థింకింగే డిఫరెంట్. ఏదైనా ఆకట్టుకునేలా వుంటుంది ఆయన వ్యవహార శైలి. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందన్న దానిపై ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన వివరాలతో అందరికీ దిమ్మ తిరిగిపోతుంది. ఒకరు ఎన్డీయేదే అధికారం అంటుంటే మరొకరు వైసిపి స్వీప్ చేస్తుందంటున్నారు.
 
ఈ పరిస్థితుల్లో రాంగోపాల్ వర్మ ఎంటర్ అయ్యారు. సిరాశ్రీ అనే నెటిజన్ ఫన్నీగా పోస్ట్ చేసిన ఓ రిపోర్టును రీ-ట్వీట్ చేస్తూ ఇదే కరెక్ట్ అయిన సర్వే అంటో ట్యాగ్ చేసాడు. అందులో ఏమున్నదంటే... వైసిపికి 0 నుంచి 175 మధ్య రావచ్చు. అలాగే ఎన్డీయే 0-175 మధ్య స్థానాలను గెలుచుకుంటుంది. లోక్ సభ స్థానాల విషయంలో ఈ రెండూ 0-25 మధ్య గెలుచుకుంటాయి అని పోస్ట్ చేసాడు. దీనికి రాంగోపాల్ వర్మ మద్దతు తెలిపాడు.

This has to be the MOST ACCURATE SURVEYhttps://t.co/XllDH47M3X

— Ram Gopal Varma (@RGVzoomin) June 2, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు