#LIEMovieTeaser : 'అబద్దం తోడులేకుండా కురుక్షేత్ర యుద్ధం పూర్తికాలేదట'...

బుధవారం, 12 జులై 2017 (11:30 IST)
టాలీవుడ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం "లై". లవ్ ఇంటెలిజెన్స్ అనేది ట్యాగ్‌లైన్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్జున్ కీలకపాత్రలో పోషిస్తున్నాడు. మేఘా ఆకాశ్ నితిన్‌కు జోడీగా నటిస్తోంది. హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీని 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపిఆచంట, అనిల్ సుంకరలు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఇది యూట్యూబ్‌లో సందడి చేస్తోంది.
 
టీజర్‌లో హీరో చెప్పిన డైలాగులు నెటిజన్లను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా 'కోట్లమంది సైనికులు సరిపోలేదట.. పంచపాండవులూ సాధించలేదట.. చివరికి కృష్ణుడూ ఒంటరి కాదట. అబద్ధం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తవదట, అశ్వాత్థామ హత:కుంజర:' అంటూ సరికొత్తగా ఉన్న డైలాగ్ వెర్షన్ మూవీపై క్యూరియాసిటీని మరింత పెంచేస్తున్నది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి