హీరో రోషన్ 'పెళ్లిసందD' ట్రైలర్ రిలీజ్

బుధవారం, 22 సెప్టెంబరు 2021 (13:05 IST)
సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా 'పెళ్లిసందD' నిర్మితమైంది. ఆర్కే ఫిల్మ్ అసోసియేట్, ఆర్కా మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో గౌరీ రోణంకి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో తెలుగు తెరకి శ్రీలీల అనే యువతి హీరోయిన్‌గా పరిచయమవుతోంది. 
 
ఇంతకాలం తెరవెనుక పాత్రకే పరిమితమైన దర్శకుడు కె.రాఘవేంద్ర రావు ఈ మూవీలో ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించారు. ఈ సినిమా ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు బుధవారం రిలీజ్ చేశారు.
 
కె.రాఘవేంద్రరావు తొలిసారిగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయడానికి చాలా సంతోషంగా ఉంది అంటూ, మహేశ్ ఈ సినిమా టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
 
లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్‌పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, పోసాని, వెన్నెల కిషోర్ వంటి భారీ తారాగణం భారీ స్థాయిలో సందడి చేశారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు