శ్రీవారి రథోత్సవం - వీడియో

గురువారం, 28 సెప్టెంబరు 2017 (13:50 IST)
శ్రీ వేంకటేశ్వర స్వామివారి స్వర్ణ రథోత్సవం గురువారం సాయంత్రం వైభవంగా జరగనుంది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణరథంపై మాడ వీధుల్లో ఊరేగనున్నారు.

గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి నూతన స్వర్ణరథంపై శ్రీవారు భక్తులకు అభయ ప్రదానం చేస్తారు. స్వామివారి స్వర్ణ రథోత్సవ సేవను కనులారా వీక్షించి తరించడానికి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు.
 
మహిళా భక్తులే స్వర్ణరథం లాగుతారు. రథోత్సవం తర్వాత రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య గజ వాహన సేవ జరగనుంది. ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును వాహనంగా మలచుకుని స్వామివారు రాత్రి తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు