సూర్యప్రభ వాహనంపై ఊరేగిన వెంకన్నస్వామి

భక్త జనుల గోవింద నామస్మరణ, కర్పూర నీరాజనాల నడుమ కలియుగ వైకుంఠ నాధుడు మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో ఏడోరోజైన మంగళవారం సర్వాలంకరణాభూషితుడైన శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంలో ఊరేగిన వైనాన్ని భక్తపరివారమంతా వీక్షించి ఆనంద పారవశ్యంలో తేలియాడింది.

ఇకపోతే... మంగళవారం రెండుగంటలకు తిరుమంజనం, అనంతరం ఏడు గంటలకు ఊంజల్ సేవ, రాత్రి చంద్రప్రభ వాహన సేవలు జరుగనున్నాయని తితిదే వెల్లడించింది.

ఇదిలా ఉండగా... స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హుండీ ఆదాయం రోజురోజుకు పెరిగిపోతోంది. ఆరోరోజైన సోమవారం మాత్రం తిరుమలేశుని హుండీకి రూ. 1.5కోట్ల ఆదాయం లభించిందని తితిదే అధికారులు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి