అంతకుముందు శ్రీవర్షిణి, అఘోరీ ఇద్దరూ పరస్పరం దండలు మార్చుకున్నారు. అనంతరం తలంబ్రాలు పోసుకోవడం.. ఏడడుగులు వేశారు. ఈ సందర్భంగా భక్తి పాటలు పాడుతూ ఆనందంలో మునిగారు. ఈ వార్త తీవ్ర సంచలనం రేపుతోంది. యువతితో నాగసాధు పెళ్లికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన శ్రీనివాస్ పేదరికంలో పుట్టాడు. దేశవ్యాప్తంగా తిరుగుతూ సన్యాసం స్వీకరించాడు. అనంతరం అమ్మాయిగా మారాడు. నాగసాధు అవతారం ఎత్తి ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే మంగళగిరి ప్రాంతానికి చెందిన యువతి శ్రీవర్షిణితో పరిచయమైంది. ఆమెను వశం చేసుకుని ఇంటి నుంచి బయటికి రాగానే పలుచోట్ల తిరిగింది.