ఐతే ఆ తర్వాత మళ్లీ దీని జాడ 1998 వరకూ కనిపించలేదు. ఐతే 2002లో ముంబై నేచురల్ హిస్టరీ సొసైటి ఈ పక్షి కూతను, పాదముద్రలను కనుగొన్నట్లు వెల్లడించారు కానీ పక్షిని మాత్రం కనుక్కోలేకపోయారు. కాగా వైఎస్సార్ కడప జిల్లా కొండూరు సమీపంలోని చిట్టడవుల్లో ఈ పక్షి వున్నట్లు సమాచారం వుండటంతో సుమారు 3 వేల ఎకరాల అభయారణ్యాన్ని ఏర్పాటు చేసారు.
ఇలా ఈ పక్షి ఆచూకిని కనుగొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ఇప్పటివరకూ రూ. 50 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. గత నెల ఈ పక్షి కూతను పరిశోధకులు రికార్డ్ చేసారట. సుమారు 27 సెంటీమీటర్లు పొడవు వుండే ఈ పక్షి పైకి ఎగరలేదు. గుబురుగా వుండే ముళ్ల పొదల్లో నివాసం వుంటుంది. ఇది కూతపెడితే సుమారు 200 మీటర్ల వరకూ వినిపిస్తుంది.