బాలుడి ముక్కులో జిలేబీ చేప.. ఈత కోసం వెళ్తే..?

బుధవారం, 13 నవంబరు 2019 (11:19 IST)
బావిలో ఈతకొట్టేందుకు వెళ్లిన బాలుడి ముక్కులో జిలేబీ అనే రకానికి చెందిన చేప పిల్ల దూరింది. దీంతో బాధతో విలవిల్లాడిన ఆ బాలుడికి చికిత్స చేసిన వైద్యులు ఆతడి ముక్కు నుంచి జిలేబీ చేప పిల్లను ప్రాణాలతో వెలికితీశారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు పుదుక్కోట్టై జిల్లా అన్నవాసల్‌కు సమీపంలో వున్న మన్నవేలాంపట్టికి చెందిన సెల్వం కుమారుడు అరుణ్ కుమార్. 
 
ఇతడు ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ బాలుడు తన స్నేహితులతో కలిసి బావిలో ఈత కోసం వెళ్లాడు. ఆ సమయంలో అతడి ముక్కులో జిలేబి చేప పిల్ల దూరింది. దీంతో బాధతో ఇబ్బంది  పడిన అరుణ్ కుమార్‌ను తోటి స్నేహితులు ఆస్పత్రిలో తరలించారు. అక్కడ బాలుడిని పరిశోధించిన వైద్యులు.. చికిత్స అందించి ఆ బాలుడి ముక్కు నుంచి చేప పిల్లను ప్రాణాలతో వెలికి తీశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు