ఇకపోతే.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో, లెఫ్టినెంట్ భార్య పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన తన భర్తకు కన్నీటితో వీడ్కోలు పలికింది. ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలపై నెటిజన్లు రకరకాలుగా తమ అభిప్రాయాలను, సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన ఒక రోజు తర్వాత, బుధవారం దక్షిణ కాశ్మీర్లోని కుల్గామ్లోని టాంగ్మార్గ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది.