ఆంబూరులో మటన్ బిర్యానీ కాదు.. డాగ్ బిర్యానీ.. పరుగులు తీసిన జనం..

మంగళవారం, 20 నవంబరు 2018 (18:01 IST)
తమిళనాడు రాజధాని చెన్నై ఎగ్మూర్‌ స్టేషన్‌లో 1000 కిలోల కుక్క మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.. రైల్వే అధికారులు. ఈ మాంసాన్ని ఎప్పుడైతే పోలీసులు స్వాధీనం చేసుకున్నారో.. హోటళ్లలో వెళ్లి బిర్యానీ తినేవారికి భయం పట్టుకుంది. హోటళ్లలో మటన్‌కు బదులు కుక్క మాంసాన్ని వాడుతున్నారని తేలడంతో.. జనం బిర్యానీ అంటేనే జడుసుకుంటున్నారు.
 
ఈ నేపథ్యంలో బిర్యానీకీ బాగా పాపులర్ అయిన తమిళనాడులోని ఆంబూరులో మటన్‌తో పాటు కుక్క మాంసాన్ని కలిపి బిర్యానీ వండటమే కాకుండా అమ్మాలని చూసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంబూరులోని ఓ షాపులో చౌక ధరకే బిర్యానీ అమ్ముతున్నట్లు తెలియడంతో ప్రజలు ఆసక్తిగా వెళ్లి, బిర్యానీ లాగించారు. 
 
అయినా బిర్యానీ తింటుండగా అది మటనా అనే డౌట్ జనాలకు రావడంతో.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ షాపు వద్దకు వెళ్లి విచారణ జరపడంతో.. అది మటన్ బిర్యానీ కాదని.. డాగ్ బిర్యానీ అని తేలింది. అంతే ఆ షాపుకు వచ్చిన జనం అబ్బే అంటూ చేతులు కూడా వాంతులు చేసుకుంటూ పరుగులు తీశారు. దీంతో షాపు నడిపిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు