రూబీ రోమన్‌ ద్రాక్ష.. ఒక బంచ్ ధర రూ.33వేలు..

బుధవారం, 22 సెప్టెంబరు 2021 (21:23 IST)
Grapes
ద్రాక్ష పండు తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. సాధారణంగా రెండు రకాల ద్రాక్షలు చూసి ఉంటారు. కానీ ద్రాక్షలో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటి ధర సీజన్‌లో అయితే రూ.వంద పైన సాధారణ రోజుల్లో 40-80 మధ్య ఉంటుంది. అయితే ఒక ద్రాక్ష పండు రకం ధర మాత్రం ఏకంగా రూ.లక్షల్లో ఉంటుంది. ఒక్క పండు ధరనే రూ.30 వేలకు పైగా ఉంటుంది. ఆ పండు ఏ రకమో.. ఆ పండు ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.
 
రూబీ రోమన్‌ ద్రాక్షగా పిలిచే ఈ పండ్లు అత్యధిక ధర కలిగి ఉంటుంది. ఈ పండ్లు జపాన్‌లో మాత్రమే లభిస్తుంటాయి. ఆ దేశంలోని ఇషికావా అనే ప్రాంతంలో మాత్రమే లభించే ఈ రూబీ రోమన్‌ పండ్లుకు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంటుంది. 
 
ఈ ఎర్రని ద్రాక్ష గుత్తి ధర మాత్రమే 12 వేల డాలర్లు. భారత కరెన్సీలో అక్షరాల రూ .7.5 లక్షలు. ఏంటి షాక్ అయ్యారా? కానీ ఇది నిజం. ఒక్క ద్రాక్ష పండు ధర అయితే రూ. 35వేలకు పైగా ఉందట. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్షగా అది రికార్డు నమోదు చేసింది. ప్రతి సంవత్సం 24వేల రూబీ రోమన్ ద్రాక్ష గుత్తులు మాత్రమే సాగు చేయబడతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు