షాక్... మహేష్ 'మహర్షి' చిత్రాన్ని మా థియేటర్లలో వేయడంలేదు... ఎందుకని?

సోమవారం, 6 మే 2019 (16:25 IST)
అసలే మే నెల సెంటిమెంటుతో ప్రిన్స్ మహేష్ బాబు భయపడిపోతుంటే ఓ ప్రముఖ థియేటర్ యాజమాన్యం మహేష్ బాబు మహర్షి చిత్రాన్ని మే 9న వేయడంలేదంటూ తెలిపి షాక్ ఇచ్చింది. చెన్నైకు చెందిన జి.కె సినిమాస్ ఎమ్.డి రూబన్ ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించారు. డిస్ట్రిబ్యూటర్ల సహకారం కొరవడిందనీ, సరైన పద్ధతిలో వారు తమను సంప్రదించకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
 
కాగా చెన్నైలో వేకువ జామున 5 గంటలకే మహేష్ బాబు మహర్షి చిత్రం విడుదలవుతుంది. తొలిసారిగా ఓ తెలుగు చిత్రం తమిళనాడులో ఇలా విడుదలవడం విశేషం. ఐతే ప్రముఖ థియేటర్లలో చిత్రం ప్రదర్శించకపోతే నిర్మాతలకు నష్టమే మరి. మరోవైపు అభిమానులకు కూడా ఇది నిరాశపరిచే విషయమే. మరి నిర్మాతలు ఏమయినా దీనిపై నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు