ప్రేమించుకున్నారనీ.. నూలుపోగు లేకుండా ఊరేగించారు... ఎక్కడ?

శనివారం, 7 జులై 2018 (17:08 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఇద్దరు మేజర్లు ప్రేమించుకున్న నేరానికి శరీరంపై నూలు పోగు లేకుండా చేసి గ్రామంలో ఊరేగించారు. పైగా, ఈ ఊరేగింపును కొందరు యువకులు మొబైల్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఊరేగింపు వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదైపూర్‌లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఉదయ్‌పూర్ పరిధిలోని సెర్ గ్రామానికి గిరిజన తెగకు చెందిన యువకుడు సమీప గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఆ తర్వాత పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని గ్రామస్తులు వారిద్దరికీ శిక్ష విధించారు. ఇద్దరినీ పట్టుకుని లోదుస్తులు తొలగించి తాళ్లతో కట్టేశారు. అనంతరం గ్రామంలో ఊరేగించారు. 
 
జనాలు వారిని వీడియో తీస్తూ వినోదం చూశారు తప్పితే ఒక్కరంటే ఒక్కరు కూడా అడ్డుకునేందుకు ముందుకు రాకపోవడం విస్మయపరుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ప్రేమ జంటను విడిపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు