పనీర్ టైప్ టూ డయాబెటిస్ను దూరం చేస్తుంది. ఒబిసిటీ, హైపర్టెన్షన్ను తగ్గిస్తుంది. బరువును తగ్గించే పనీర్లో క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి. పనీర్ తేలికగా జీర్ణమవుతుంది. ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. అలాంటి పనీర్, క్యాప్సికమ్లను తీసుకోవడం ద్వారా ఎముకలకు బలాన్ని ఇస్తాయి.
తయారీ విధానం :
ముందుగా పనీర్ను ఫ్రిజ్ నుంచి తీసి కాసేపయ్యాక పనీర్ను డైమండ్ ఆకారంలో ముక్కలు చేసుకోవాలి. అందులో మైదా, కార్న్ఫ్లోర్, కోడిగుడ్డు సొన వేసి కలపాలి. వీటి మిశ్రమం పనీర్ ముక్కలకు కోటింగ్గా పట్టేస్తుంది. ఇలా కలిపిన వెంటనే నూనె వేడిచేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టాలి.
బాణలిలో ఒక టీ స్పూను నూనె వేసి వేడిచేసి సన్నగా తరిగిన మిర్చి, వెల్లుల్లి వేసి వేగిన తరువాత రెండు టీ స్పూన్ల నీళ్లు, ఉప్పు, అజనొమోటో, చిల్లీ సాస్ వేసి అన్నింటినీ దోరగా వేపుకున్న తర్వాత వేయించి వుంచిన పనీర్ ముక్కల్ని అందులో కలిపి ఐదు నిమిషాల తర్వాత దింపేయాలి. ఈ చిల్లీ పన్నీర్ను పిల్లలకు రోటీలకు గార్నిష్తో సర్వ్ చేస్తే చాలా ఇష్టపడి తింటారు.