పైనాపిల్లో దగ్గు, జలుబును నియంత్రించే గుణాలున్నాయి. జీర్ణక్రియను మెరుగుపరచడం, ఎముకలను బలపరిచే పైనాపిల్తో జ్యూస్లు, సలాడ్లే కాకుండా పైనాపిల్తో ఫ్రైడ్ రైస్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దామా?
కావలసినవి : బాస్మతి రైస్ - 180 గ్రా. పైనాపిల్ ముక్కలు - 50 గ్రా జీడిపప్పు - 15 గ్రా కిస్మిస్ - 10 గ్రా కారం - 10 గ్రా ఉప్పు - రుచికి తగినంత ఉల్లికాడల తరుగు - 2 టీ స్పూన్లు రిఫైన్డ్ ఆయిల్ - 15 ఎం.ఎల్ పండు మిర్చి తరుగు - టీ స్పూన్ వెల్లుల్లి తరుగు - టీ స్పూన్ బీన్స్ తరుగు - 30 గ్రాములు పసుపు - చిటికెడు
తయారీ : బియ్యంలో నీళ్లు పోసి పలుకగా ఉడికించాలి. చల్లారిన తర్వాత కొద్దిగా నూనె వేసి, అన్నం ఆరబెట్టాలి. స్టౌమీద కడాయి పెట్టి, పోపుకు తగినంత నూనె వేసి, వేడి చేయాలి. అందులో వెల్లుల్లి తరుగు, పండుమిర్చి తరుగు, బీన్స్, క్యారట్ తరుగు వేసి కలపాలి. పోపు గింజలు, ఉప్పు, కూరగాయ ముక్కలు, కారం, అన్నం, పసుపు, పైనాపిల్ ముక్కలు వేసి బాగా కలిపి, ప్లేట్లోకి తీసుకోవాలి. వేయించిన జీడిపప్పు, కిస్మిస్, ఉల్లికాడలతో గార్నిష్ చేసి, సర్వ్ చేయాలి. ఈ పైనాపిల్ రైస్ను చికెన్ గ్రేవీతో గానీ, కడాయ్ పనీర్తో గానీ సర్వ్ చేయవచ్చు.