బరువు తగ్గాలనుకునే వారు.. నిమ్మకాయ-దోసకాయ రసం తాగితే..

గురువారం, 1 జూన్ 2023 (12:10 IST)
మహిళలు బరువు తగ్గాలనుకునే వారు కొన్ని రకాల డ్రింక్స్ తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా వేసవి తాపం నుండి తప్పించుకోవచ్చు. అలాంటి పానీయాలేంటో చూద్దాం. 
 
నిమ్మకాయ-దోసకాయ పానీయం: చిన్న దోసకాయ, నిమ్మకాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెడల్పాటి జాడీలో వేసి రెండు గ్లాసుల నీళ్లతో నింపాలి. దానితో పాటు కొన్ని పుదీనా ఆకులను రుబ్బుకోవాలి. ఈ రసాన్ని వడపోసి ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరానికి చేరే క్యాలరీలను అదుపులో ఉంచుకుని నీటిని నిలుపుకోవడానికి ఇది సహకరిస్తుంది. ఇది తాగితే రోజంతా ఉత్సాహంగా పని చేయవచ్చు. 
 
అలాగే క్యారెట్-ఆరెంజ్ జ్యూస్: క్యారెట్‌లో ఫైబర్, బీటా కెరోటిన్ మొదలైనవి ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి. ఇది తక్కువ తినడానికి కూడా దారి తీస్తుంది. నారింజలో ఉండే విటమిన్ సి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అందులో కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు వేసి తాగాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు