భారతీయ రైలు పట్టాలపైకి అత్యాధునిక హంగులతో కూడిన లగ్జరీ రైలు పరుగులు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ రైలు పేరు తేజస్ ఎక్స్ప్రెస్. దేశంలో అత్యంత వేగంతో ప్రయాణించే తొలి రైలు. దీన్ని తొలుత దేశ ఆర్థిక రాజధాని ముంబై నంచి ప్రముఖ సముద్రతీర పర్యాటక ప్రాంతమైన గోవాల మధ్య ప్రారంభించనున్నారు. ఈ రైలులో ఉన్న అత్యాధునిక సౌకర్యాలను చూస్త కళ్లు జిగేల్మనిపిస్తాయి.
గంటకు 130 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ రైలు సాధారణ రైలుబండి కాదు.. ఓ లగ్జరీ ఎక్స్ప్రెస్. మొత్తం 20 బోగీలు కలిగిన ఈ రైలులో ఎల్సిడ్ స్క్రీన్లు, ఫ్రీ వైఫై, టీ, కాఫీ వెండింగ్ మెషీన్లు అందుబాటులో ఉంటాయి. అలాగే, మ్యాగజైన్లు, ఆటోమేటిక్ డోర్లు, స్నాక్ టేబుల్స్తో పాటు.. పాకశాస్త్రంలో ఆరితేరిన వంటవాళ్ళతో తయారు చేసిన ఆహారం ఇందులో లభిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా.. భారతీయ రైల్వే వ్యవస్థలోనే తొలిసారి ప్రతి కోచ్కు ఆటోమేటిక్ డోరింగ్ వ్యవస్థ, సెక్యూర్డ్ గ్యాంగ్వేస్ వంటి సౌకర్యాలను కల్పించడం ఈ రైలు ప్రత్యేకత.