ఎగుమతి పోటీతత్వాన్ని బలోపేతం చేయడానికి ఎఫ్ఐఈఓతో స్టెన్ భాగస్వామ్యం

ఐవీఆర్

బుధవారం, 25 సెప్టెంబరు 2024 (21:56 IST)
అంతర్జాతీయ వాణిజ్యంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలకు సంబంధించిన ఫైనాన్సింగ్ కోసం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ అయిన స్టెన్, చిన్న మరియు మధ్య తరహా సంస్థల (ఎస్ఎంఈ లు) పెరుగుతున్న ఫైనాన్సింగ్ అవసరాలను తీర్చడానికి భారతదేశంలో తన వ్యూహాత్మక విస్తరణను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా $20 బిలియన్ల విలువైన ఇన్‌వాయిస్‌లకు ఆర్థిక సహాయం చేయడం ద్వారా అంతర్జాతీయ వాణిజ్యానికి మద్దతు ఇవ్వడంలో స్టెన్ ఇప్పటికే గణనీయమైన పురోగతిని సాధించింది, ఇందులో సుమారుగా $147m భారతీయ సరఫరాదారుల నుండి గత కొన్ని సంవత్సరాలుగా వచ్చింది మరియు ఇది ప్రతి సంవత్సరం స్థిరంగా పెరుగుతుంది. భారతదేశం తన వృద్ధిని కొనసాగిస్తున్నందున రాబోయే 1 నుండి 3 సంవత్సరాలలో గణనీయమైన వృద్ధిని తాము సాధించగలమని స్టెన్ అంచనా వేస్తుంది. ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న వ్యవస్థాపకులకు మద్దతుగా స్టెన్ కొత్త కార్యక్రమాలను ప్రారంభించింది.
 
రాబోయే కొద్ది సంవత్సరాల్లో, భారతదేశం యొక్క ఎగుమతి ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో కీలక పాత్ర పోషించాలని స్టెన్ లక్ష్యంగా పెట్టుకుంది, దేశం యొక్క ప్రతిష్టాత్మకమైన వాణిజ్య లక్ష్యాలకు ఎస్ఎంఈలు గణనీయంగా దోహదపడేలా చేస్తుంది. ఈ దృక్పథాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు, ప్రపంచ మార్కెట్‌లో భారతీయ వ్యాపారాలు లిక్విడిటీ సవాళ్లను ఎదుర్కొనేందుకు మరియు వాటికి పోటీతత్వాన్ని పెంపొందించేందుకు భారత ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన భారత ఎగుమతి ప్రమోషన్ సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈఓ)తో స్టెన్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. 
 
ఈ భాగస్వామ్యం ఎస్ఎంఈ లు తమ కార్యకలాపాలను విస్తరించటానికి మరియు అంతర్జాతీయ అవకాశాలను చేజిక్కించుకోవడానికి అవసరమైన ఆర్థిక సాధనాలతో సన్నద్ధం చేయడం ద్వారా ఎగుమతి వృద్ధిని నడపడానికి ప్రయత్నిస్తుంది. సంతకం చేసిన అవగాహన ఒప్పందాన్ని స్టెన్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శ్రీ  నోయెల్ హిల్‌మాన్ మరియు ఎఫ్‌ఐఈఓ డైరెక్టర్ జనరల్ మరియు సీఈఓ డాక్టర్ అజయ్ సహాయ్ లు ఎఫ్‌ఐఈఓ అధ్యక్షుడు శ్రీ అశ్వని కుమార్, స్టెన్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శ్రీ మార్సియో ఆర్నెకే, ఎఫ్‌ఐఈఓ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రతీక్ అశోక్ నవాలే, మరియు సీనియర్ డైరెక్టర్ సేల్స్ & పార్టనర్‌షిప్ (ఇండియా),స్టెన్, శ్రీ ప్రియేష్ రంజన్ సమక్షంలో మార్చుకున్నారు. 
 
వృద్ధికి అవకాశాలు కల్పించటానికి రూపొందించబడిన స్టెన్ యొక్క ఫైనాన్సింగ్ సాధనాలు, వర్కింగ్ క్యాపిటల్ యొక్క సాధారణ పరిమితులు లేకుండా ఎగుమతిదారులను విస్తరించటానికి అనుమతిస్తాయి. ట్రేడ్ ఫైనాన్స్‌కు సౌకర్యవంతమైన అవకాశాలతో, భారతీయ ఎస్ఎంఈలు పెద్ద ఆర్డర్‌లను తీసుకోవచ్చు, కొత్త మార్కెట్‌లలోకి విస్తరించవచ్చు మరియు ఇప్పటికే ఉన్న వాటిలో తమ కార్యకలాపాలను బలోపేతం చేసుకోవచ్చు. ఈ భాగస్వామ్యంలో భాగంగా, స్టెన్ మరియు ఎఫ్ఐఈఓ భారతీయ ఎగుమతిదారుల ప్రపంచ ఆశయాలకు మద్దతు ఇవ్వడం ద్వారా కొత్త ప్రాంతాలలోకి ప్రవేశించడంలో మరియు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న అవకాశాలను చేజిక్కించుకోవడంలో సహాయపడాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
 
స్టెన్ యొక్క చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శ్రీ నోయెల్ హిల్‌మాన్ ఈ ఆకాంక్షలను ప్రతిధ్వనిస్తూ, "ఎఫ్ఐఈఓతో మా భాగస్వామ్యం భారతీయ ఎగుమతిదారులు తమ వ్యాపార కార్యకలాపాలను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంలో సహాయం చేయడానికి బలమైన నిబద్ధతను సూచిస్తుంది. సౌకర్యవంతమైన ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందించడం ద్వారా, చెల్లింపు నష్టాలను తగ్గించడం ద్వారా, మేము వ్యాపారాలను వేగంగా విస్తరించేందుకు తగిన అవకాశాలను కల్పిస్తున్నాము. పెద్ద సంస్థలతో పోటీ పడేందుకు తగిన అవకాశాలను అందిస్తున్నాము. వాణిజ్యాన్ని సులభతరం చేయడంలో మరియు భారతదేశం యొక్క వస్తువులు, సేవల ఎగుమతుల వృద్ధికి  ఎఫ్ఐఈఓ దోహదపడుతుంది. తమ వృద్ధి ప్రయాణంలో స్టెన్ యొక్క మద్దతు కారణంగా ఎఫ్ఐఈఓ సభ్యులు గణనీయంగా ప్రయోజనం పొందగలరని మేము విశ్వసిస్తున్నాము. అర్ధవంతమైన ప్రభావాన్ని చూపే ఈ భాగస్వామ్య అవకాశంలో మాతో చేతులు కలిపిన ఎఫ్ఐఈఓ సభ్యులకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము " అని అన్నారు.
 
ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్, శ్రీ అశ్వనీ కుమార్ ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, రెండు ప్రధాన సంస్థలు- భారతదేశంలోని అపెక్స్ ట్రేడ్ ప్రమోషన్ బాడీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈఓ), మరియు అంతర్జాతీయ వాణిజ్యంలో ఎస్ఎంఈలకు పోస్ట్-షిప్‌మెంట్ క్రెడిట్‌ని అందజేస్తున్న  ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ, స్టెన్, మధ్య ఎంఓయు పై సంతకాలు జరుగుతున్న సమయం ఒక ముఖ్యమైన సందర్భమని అన్నారు. 
 
ఈ ఎంఓయు , పోస్ట్-షిప్‌మెంట్‌పై దృష్టి సారించి ఎగుమతుల యొక్క వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను పరిష్కరించడానికి మార్గం సుగమం చేస్తుందని తాను విశ్వసిస్తున్నానని శ్రీ అశ్వనీ కుమార్ పునరుద్ఘాటించారు. ఇది భారతదేశంలోని ఫ్యాక్టరింగ్ కంపెనీల మధ్య ఆరోగ్యకరమైన పోటీకి దారి తీస్తుంది, తద్వారా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భౌగోళిక-రాజకీయ పరిస్థితులు మరియు వడ్డీ రేట్లు పైకి వెళ్తున్నందున క్రెడిట్ సవాళ్లు పెరిగాయని ఎఫ్ఐఈఓ చీఫ్ జోడించారు. అయినప్పటికీ, ద్రవ్యోల్బణం అందుబాటులోనే  ఉండటంతో, యుఎస్  ఫెడరల్ రిజర్వ్ నేతృత్వంలోని కీలక రేట్లలో మేము దిగువ కదలికను చూశాము, ఇది గత వారం ఈ రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. భారతదేశంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం మరియు జిడిపి వృద్ధి పైకి కదులుతున్నందున, మన  సెంట్రల్ బ్యాంక్ కూడా కీలక రేట్లను సవరించడానికి తగిన పిలుపునిస్తుందని ఆశిస్తున్నట్లు శ్రీ కుమార్ తెలిపారు. ఎగుమతి రంగం యొక్క వ్యాపార వాతావరణంలో కొనసాగింపు మరియు స్థిరత్వాన్ని అందించడానికి స్థిరమైన ప్రాతిపదికన ఇంట్రెస్ట్ ఈక్వలైజేషన్ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఎఫ్ఐఈఓ అధ్యక్షుడు ఈ కార్యక్రమంలో వెల్లడించారు.
 
ఎఫ్ఐఈఓ  డైరెక్టర్ జనరల్ మరియు సీఈఓ డాక్టర్ అజయ్ సహాయ్ మాట్లాడుతూ, 2030 నాటికి భారతదేశం యొక్క ప్రతిష్టాత్మక లక్ష్యం యుఎస్ డి  2 ట్రిలియన్ల ఎగుమతులు చేరుకోవడానికి  మా ఎగుమతిదారులు, ముఖ్యంగా ఎస్ఎంఈ లు ఎదుర్కొంటున్న క్లిష్టమైన ఫైనాన్సింగ్ సమస్యలను పరిష్కరించడానికి తక్షణ చర్యను డిమాండ్ చేస్తుంది. ఎస్ఎంఈలకు అవసరమైన రుణ అవసరాలలో 15% మాత్రమే ప్రస్తుతం అధికారిక ఛానెల్‌ల ద్వారా తీర్చబడుతున్నాయి, మనం అత్యంత డైనమిక్ సెక్టార్ యొక్క సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాము. ఈ క్రెడిట్ క్రంచ్ కేవలం వ్యాపార సమస్య కాదు; ఇది జాతీయ ఆర్థిక అవసరం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు