లీడ్స్ టెస్ట్ మ్యాచ్ : తొలి ఇన్నింగ్స్‌‍లో భారత్ 471 ఆలౌట్

ఠాగూర్

శనివారం, 21 జూన్ 2025 (19:21 IST)
ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 471 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి రోజున 359/3 పరుగులు చేసింది. తొలి రోజు ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్... మరో 112 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. అలాగే, 127 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన కెప్టెన్ శుభమన్ గిల్ 227 బంతుల్లో 147 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 65 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన రిషభ్ పంత్ 178 బంతుల్లో 12 ఫోర్లు 6 సిక్స్‌లతో 134 పరుగులు చేశాడు. 
 
ఐపీఎల్‌లో అదరగొట్టి చాలాకాలం తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన కరుణ్ నారయ్ నిరాశపరిచాడు. నాలుగు బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా 11, శార్దూల్ ఠాకూర్ ఒక్క పరుగుతో నిరాశపర్చాడు. తొలి రోజే యశస్వి జైశ్వాల్ 159 బంతుల్లో 16 ఫోర్లు, ఓ సిక్స్‌ల సాయంతో 101 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 4, జోష్ టంగ్ 4, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ తలా వికెట్ పడగొట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు