చైనా సూపర్ సిరీస్: ఫైనల్లోకి అడుగుపెట్టిన పీవీ సింధు.. సున్‌ యుతో ఢీ..

శనివారం, 19 నవంబరు 2016 (19:49 IST)
చైనా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్, ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు అదరగొట్టింది. కెరీర్‌లో తొలి సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించేందుకు కేవలం అడుగుదూరంలో నిలిచింది. ఈ ఈవెంట్‌లో హైదరాబాదీ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం హోరాహోరీగా జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఏడో సీడ్‌ సింధు 11-21, 23-21, 21-19 స్కోరుతో ఆరో సీడ్‌ సుంగ్ జి హ్యున్‌‌పై విజయం సాధించింది. 
 
సెమీఫైనల్ పోరులో పీవీ సింధు మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. మ్యాచ్ ఆద్యంతం ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. ఆ తర్వాత సాగిన రెండు గేమ్‌ల్లో సింధు సుంగ్ జి హ్యున్‌‌పై గెలిచి ఫైనల్స్‌కు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్స్‌‌లో సున్‌ యుతో తలపడనుంది. 

వెబ్దునియా పై చదవండి