ఇలాంటి పరిస్థితుల్లో రావల్పిండి ఎక్స్ప్రెస్, పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్లో ఆడటానికి విదేశీ జట్లు రావద్దని హెచ్చరించాడు. క్వెట్టా పోలీస్ అకాడమీపై ఉగ్రవాదులు దాడి చేసి, 62 మంది పోలీసులను హతమార్చిన నేపథ్యంలో అతను ఈ వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుత పరిస్థితుల్లో తమ దేశంలో భద్రత లేదని, ఇక్కడ పర్యటించే విదేశీ జట్లకు ఇది ఏమాత్రం సురక్షితం కాదని, పరిస్థితులు మెరుగుపడేంత వరకు పాక్లో పర్యటించవద్దని సూచించాడు. అదేసమయంలో స్వదేశంలో మ్యాచ్లు ఆడేందుకు పాక్ క్రికెట్ బోర్డు చేస్తున్న ప్రయత్నాలను అక్తర్ తప్పుబట్టాడు.