క్లాసులు ఎగ్గొడితే వీసా రద్దు: ట్రంప్ ఉద్దేశ్యం ఇండియన్స్‌ను ఇంటికి పంపించడమేనా?!!

ఐవీఆర్

మంగళవారం, 27 మే 2025 (19:34 IST)
రెండోసారి అమెరికా అధ్యక్షుడుగా పీఠం ఎక్కిన దగ్గర్నుంచి డొనాల్డ్ ట్రంప్ ఎన్నారైల పైనే టార్గెట్ పెట్టినట్లు కనిపిస్తోంది. వీసాలకు సంబంధించిన నిబంధనలను అత్యంత కఠినతరంగా మార్చేసారు. అక్కడ కూడా భారతీయులు దొరక్కపోవడంతో ఇక లాభం లేదనుకున్నారో ఏమోగానీ ఏకంగా కళాశాల క్లాసులు ఎగ్గొడితే వీసాలు రద్దు చేస్తామని కొత్త నియమాన్ని తెచ్చేసారు. ట్రంప్ వరస చూస్తుంటే అమెరికా నుంచి ఇండియన్స్ ను ఎలాగోలా ఇంటికి... అంటే తిరిగి భారతదేశానికి పంపించాలని కంకణం కట్టుకున్నట్లు కనబడుతోంది. ఇందులో భాగంగానే ఆయన ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటున్నారంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
 
అమెరికాలో రెండో అతిపెద్ద ఎన్నారై కమ్యూనిటీగా ఇండియన్స్
అమెరికాలో రెండో అతిపెద్ద ఎన్నారై కమ్యూనిటీగా భారతీయులు వున్నారు. తొలిస్థానంలో మెక్సికన్లు వుండగా ఆ తర్వాతి స్థానంలో భారతీయులు వున్నారు. మెక్సికోకి చెందిన వారు కోటి మంది వుండగా, భారతదేశ మూలాలు కలిగినవారు 50 లక్షల మంది వున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024 నాటికి 5.4 మిలియన్లకు పైగా భారతీయులు USAలో నివసిస్తున్నారు. వారిలో 3.3 మిలియన్లకు పైగా భారతీయ సంతతికి చెందినవారు. ఈ ప్రకారంగా అమెరికన్ల జనాభాలో ఇండియన్లు 6%గా వున్నట్లు తెలుస్తోంది. ఈ శాతం క్రమంగా పెరుగుతూ పోయినట్లయితే కొన్నాళ్లకు అమెరికాను శాసించే శక్తిగా ఇండియన్స్ మారుతారేమోనన్న భయంతో ట్రంప్ ఈ పనులు చేస్తున్నారనే చర్చలు సైతం నడుస్తున్నాయి.
 
మరోవైపు దేశ అంతర్గత భద్రత విషయంలో ఎలాంటి అనుమానం వచ్చినా ఎన్నారైలకు సంబంధించి వీసాలను రద్దు చేయవచ్చంటూ తాజాగా మరో వార్త కూడా వెలుగులోకి వచ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు