ప్రాగ్‌లో దారుణం - విద్యార్థి కాల్పుల్లో 15 మంది మృతి

శుక్రవారం, 22 డిశెంబరు 2023 (08:31 IST)
చెక్‌ రిపబ్లిక్‌ రాజధాని నగరమైన ప్రాగ్‌లోని చార్ల్స్ యూనివర్సిటీలో ఓ దండుగుడైన విద్యార్థి జరిపిన సమూహకాల్పుల్లో 15 మంది మృతి చెందగా, మరో 30 మంది గాయపడినట్లు చెక్‌ పోలీసులు గురువారం తెలిపారు. కాల్పులకు పాల్పడిన విద్యార్థి కూడా ఈ ఘటనలో మృతి చెందాడు. నగరంలోని జాన్‌ పాలాహ్‌ కూడలిలో ఉన్న చెర్ల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలోని ఆర్ట్స్ విభాగం వద్ద ఈ కాల్పులు జరిగాయి. 
 
అయితే, నిందితుడు తొలుత తన తండ్రిని చంపి ఆపై యూనివర్శిటీలో కాల్పులకు తెగబడినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టిన తరుణంలోనే ప్రాగ్ నగరానికి చేరుకుని ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీస్ చీఫ్ మార్టిన్ వాండ్రసెక్ తెలిపారు. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రాగ్ వస్తున్న నిందితుడి కోసం పోలీసులు ఆర్ట్స్ విభాగం భవంతిలో గాలిస్తుండగా అతడు మరో భవంతిలోకి వెళ్ళాడు. 
 
కాగా, రష్యాలో గతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని, దాన్ని స్ఫూర్తిగా తీసుకునే నిందితుడు ఈ దారుణానికి పాల్పడివుంటాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ ఘటనపై ఐరోపా దేశాధినేతలు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 1993 స్వతంత్ర దేశంగా అవతరించిన తర్వాత చెక్ రిపబ్లిక్‌లో జరిగిన అత్యంత దారుణ ఘటన ఇదే కావడం గమనార్హం. 
 
రైలులో ఎదురుపడిన బాలుడికి లాప్‌టాప్‌ను బహుమతిగా ఇచ్చిన రైల్వే మంత్రి 
 
తనకు రైలులో తారసపడిన ఓ బాలుడికి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బహుమతిగా లాప్‌టాప్ ఇచ్చాడు. దీంతో ఆ బాలుడి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. తాను రూపొందించిన వీడియోలను బాలుడు మంత్రికి చూపించాడు. వీటిని చూసిన మంత్రి ఆ బాలుడిలోని సృజనాత్మకతను చూసి మురిసిపోతూ లాప్‌టాప్ బహుమతిగా ఇస్తానని హామీ ఇచ్చి, తన మాటను నిలబెట్టుకున్నారు. 
 
ఇటీవల రైల్వే మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ త్రిస్సూర్ నుంచి కోళికోడ్ వెళుతుండగా రైల్లో తొమ్మిదేళ్ల బాలుడు శ్రీరామ్ తారసపడ్డారు. తాను రూపొందించిన పలు సృజనాత్మక వీడియోలను మంత్రికి చూపించి ఎంతో సంతోషపడిపోయాడు. వీటిని చూసిన తాను కూడా ఆనందం వ్యక్తంచేశాను. పైగా, అతడికి కొత్త లాప్‌టాప్‌ను బహుమతిగా ఇస్తానని మంత్రి మాట ఇచ్చారు. ఈ మాటను ఇపుడు నిలబెట్టుకున్నారు. అనుకున్న సమయం కంటే ముందుగానే, కొత్త సంవత్సర బహుమతిగా లాప్‌టాప్ ఇచ్చానని మంత్రి తెలిపారు. బాలుడికి అతడి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి రాజీవ్ చంద్రశేఖర్... ఆ బాలుడు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు