ఘాజీపూర్లోని దాద్రి ఘాట్ వద్ద ఒక పెద్ద రాయి గంగానదిలో తేలుతూ వచ్చింది. ఇది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రజలు ఆ రాయిని విశ్వాసంతో పూజిస్తున్నారు. ప్రజలు ఆ రాయిని అద్భుతం అని పిలుస్తున్నారు. పురుషులు, స్త్రీలు ఆ రాయిని పూజిస్తున్నారు. ఆ రాయి ప్రవాహంలో తేలుతూ వెళ్లిపోకుండా వుండేందుకు తాడుతో దానిని కట్టేసారు. ఈ రాయి వారణాసి నుండి వస్తోందని చెబుతున్నారు.