అల్లుడితో లేచిపోయిన అత్త.. చికెన్, మటన్ లో నిద్రమాత్రలు కలిపి...

గురువారం, 5 జనవరి 2023 (18:39 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. వావి వరసలు కనుమరుగవుతున్నాయి. ఇందుకు ఈ ఘటనే నిదర్శనం. పిల్లనిచ్చిన అత్త అల్లుడితో లేచిపోయింది. కూతురు, భర్తకు తెలియకుండా రహస్యంగా ప్రేమ వ్యవహారం నడిపింది. అమెరికాలో వున్న అల్లుడిపై కన్నేసిన అత్త.. ట్రాప్ లో పడేసింది. ప్రేమగా అమెరికా నుంచి ఇంటికి పిలిపించుకుంది. 
 
అంతే మాంసాహారం పేరుతో తన కుమార్తె, భర్త తినే తిండిలో నిద్రమాత్రలు కలిపి వారు మత్తులో జారగానే అల్లుడిని లేపుకుని అమెరికా వెళ్లిపోయింది. నిద్రలేచిన భర్తకు తన భార్య, అల్లుడు కనిపించకపోవడంతో మత్తు కనపడకపోవడంతో మత్తు వదిలించుకుని పోలీస్ స్టేషన్ బాట పట్టాడు. ఈ ఘటన రాజస్థాన్ సిరోహి జిల్లాలో చోటుచేసుకుంది. రమేష్ అనే వ్యక్తికి భార్యతో పాటు ముగ్గురు కూతుళ్లు ఉండగా అందరికీ పెళ్లిళ్లు చేసేశాడు. చిన్నమ్మాయి కిస్నాను నారాయణ్ జోగి అనే యువకుడికి కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం చేశాడు. వీరు అమెరికాలో సెటిల్ అయ్యారు. 
 
వీరికి ముగ్గురు సంతానం. కానీ చిన్నల్లుడు ప్రేమలో పడింది. ఆయన్ని ట్రాప్ చేసింది. చివరికి ఇండియాకు రప్పించుకుని అల్లుడితో లేచిపోయింది. మటన్, చికెన్ వండిపెట్టి మమ్మల్ని ముంచేసిందని.. రమేష్ వాపోయాడు. తన భార్యకి, అల్లుడికి మధ్య 13 ఏళ్ల గ్యాప్ ఉందని.. తన భార్య ఇంతటి పని చేస్తుందనుకోలేదని చెప్పుకొచ్చాడు. దీంతో కేసు రాసుకున్న పోలీసులు నారాయణ్ జోగిని విదేశాల నుంచి రప్పించేందుకు చర్యలు ప్రారంభించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు