వ్యక్తి ప్రాణం తీసిన ఆవు.. ఎలా? వీడియో వైరల్

వరుణ్

సోమవారం, 24 జూన్ 2024 (16:44 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లాలో ఓ ఆవు ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ద్విచక్రవాహనంపై వెళుతున్న వ్యక్తిపై ఆవు దాడి చేసింది. దీంతో ఆ వ్యక్తి ఎదురుగా వస్తున్న బస్సు కింద పడి మృత్యువాతపడ్డాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
కోర్టు ఉద్యోగి అయిన రాజ్ అనే వ్యక్తి బైకుపై వెళుతుండగా రోడ్డు పక్కన రెండు ఆవులు పోట్లాడుకుంటున్నాయి. అందులో ఒక ఆవు ఒక్కసారిగా ఎవరూ ఊహించని విధంగా రాజ్‌ను కొమ్ములతో పొడిచింది. దీంతో ఎదురుగా వస్తున్న బస్సు చక్రాల కింద రాజ్ పడిపోవడం, అతనిపై బస్సు చక్రాలు ఎక్కడం అంతా క్షణాల్లో జరిగిపోయాయి. ఈ ఘటన తాలూకు వీడియో బయటకు రావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

 

బైకర్ పై దాడి చేసిన ఆవు.. బస్సు కింద పడి బైకర్ మృతి

తమిళనాడు - తిరునెల్వేలిలో కోర్టు ఉద్యోగి రాజ్ అనే వ్యక్తి బైకుపై వెళ్తుండగా రోడ్డు పక్కన రెండు ఆవులు కొట్లాడుకుంటున్నాయి

అయితే అందులో ఒక ఆవు ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకొచ్చి బైకును ఒక్కసారిగా నెట్టివేసింది. దీంతో పక్కనే… pic.twitter.com/bV0Nti0jTD

— Telugu Scribe (@TeluguScribe) June 24, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు