తనను బంధించేందుకు వచ్చిన అటవీశాఖ అధికారులపై ఓ పులి దాడి చేసేందుకు యత్నించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆత్మరక్షణ కోసం వారిపై దాడి చేసింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లా వండి పెరియార్ అనే గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఇటీవల అటవీ ప్రాంతం నుంచి ఓ పులి జనావాస ప్రాంతాల్లోకి వచ్చినట్టు అటవీ శాఖ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో దాన్ని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అది ఓ తేయాకు తోటలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దానికి మత్తు మందు ఇవ్వడానికి 15 మిటర్ల దూరం నుంచి మొదట కాల్పులు జరిపారు.