మూసీ నది బాధితులంతా బుల్డోజర్లతో వెళ్లి సీఎం రేవంత్ ఇంటిని కూల్చేస్తాం (Video)

ఠాగూర్

శుక్రవారం, 4 అక్టోబరు 2024 (12:31 IST)
హైదరాబాద్ నగర పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇందులోభాగంగా, అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయిస్తున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన హైడ్రా కూల్చివేతల విషయంలో దూకుడు ప్రదర్శిస్తుంది. ఇపుడు మూసీ నది పరివాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఈ నది గట్టున ఉన్న ఇళ్ళను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో బాధితులు బోరుమని ఏడుస్తున్నారు. 
 
దీనిపై ఓ బాధితురాలు మాట్లాడుతూ, "35 ఏండ్ల నుండి ఇక్కడ ఉంటున్నాం.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. రేవంత్ రెడ్డి అసలు సీఎం లాగా మాట్లాడుతున్నాడా? లక్ష మంది మూసీ బాధితులం జేసీబీలు తీస్కొని రేవంత్ రెడ్డి ఇంటి మీదకు పోతాం. ఎంత మంది మీద కేసులు పెడతారు.. రేవంత్ రెడ్డిని సంపడానికి అయినా సావడానికి అయినా సిద్ధం. మాది అక్రమ ఇల్లు అంటే చెప్పు తీసుకొని కొడతాం. హైదరాబాద్ చెత్త మొత్తం పోసే జవహర్ నగర్ చెత్త కుప్పలో మమ్మల్ని ఉండమంటవా. రూపాయి రూపాయి జమ చేసి కట్టుకొని ఇల్లు వదిలేసి ఆ చెత్త కుప్పలో మేమెందుకు ఉండాలి.. రేవంత్ రెడ్డినే అక్కడ ఉండమనండి. ఎవడొచ్చి ఇల్లు కూలుస్తాడో అని నిద్ర పట్టట్లేదు. రేవంత్ రెడ్డిని సీఎం సీటు నుండి దింపెస్తాం'' అని హెచ్చరించారు. 
 

35 ఏండ్ల నుండి ఇక్కడ ఉంటున్నాం.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది

రేవంత్ రెడ్డి అసలు సీఎం లాగా మాట్లాడుతున్నాడా

లక్ష మంది మూసీ బాధితులం జెసిబిలు తీస్కొని రేవంత్ రెడ్డి ఇంటి మీదకు పోతాం

ఎంత మంది మీద కేసులు పెడతారు.. రేవంత్ రెడ్డిని సంపడానికి అయినా సావడానికి అయినా… pic.twitter.com/ezuOEKEDJC

— Telugu Scribe (@TeluguScribe) October 4, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు