30 ఏళ్ల టెక్కీ 130 నిద్రమాత్రలు మింగింది.. ఎందుకో తెలుసా?

సెల్వి

సోమవారం, 8 జులై 2024 (14:18 IST)
సంగారెడ్డికి చెందిన 30 ఏళ్ల టెక్కీ 130 నిద్రమాత్రలు మింగింది. వైవాహిక జీవితంలో ఏర్పడిన సమస్యలే ఈ ఆత్మహత్యకు కారణమని పోలీసుల విచారణలో వెల్లడి అయ్యింది. బాధితురాలిని పోలీసులు రీనాగా గుర్తించారు. 
 
కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న ఈమె విడాకులు తీసుకున్నారు. ఆమె డిప్రెషన్‌కు మందులు తీసుకుంటున్నట్లు తెలిసింది అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాధవపురి కాలనీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్న 30 ఏళ్ల మహిళ తన ఇంట్లో శవమై కనిపించింది. గత రాత్రి ఆమె 130 నిద్రమాత్రలు మింగింది. 
 
సోమవారం ఉదయం నిద్ర లేవకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. నిద్రలోనే మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 
 అమీన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. విచారణ కొనసాగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు