రైతు భరోసా డబ్బు కోసం కొడవలితో తండ్రి నాలుక కోసిన కొడుకు.. ఎక్కడో తెలుసా?

సెల్వి

బుధవారం, 25 జూన్ 2025 (09:57 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. డబ్బుల కోసం ఏదైనా చేసేందుకు సిద్ధమవుతున్నారు చాలామంది. తాజాగా ప్రభుత్వ పథకం కింద తనకు రావాల్సిన డబ్బు ఇవ్వలేదనే కోపంతో ఓ యువకుడు తన తండ్రి నాలుక కోసిన సంఘటన హవేళిఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాలో కలకలం రేపుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. బానోత్ కీర్యా అనే రైతుకు ఎకరం భూమి వుంది. రైతు భరోసా కింద ఆరువేల రూపాయలు అతన బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఆ డబ్బు కోసం కీర్యా చిన్న కొడుకు సంతోష్ పట్టుపట్టాడు.

అయితే కీర్యా ఇటీవల ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కీర్యా రూ.2,000 వైద్యం కోసం ఖర్చు చేశానని.. మిగతా రూ.4,000 ఇస్తానని చెప్పాడు. కానీ ఈ సమాధానం సంతోష్‌కు నచ్చక కోపంతో ఊగిపోయాడు. 
 
ఆ డబ్బుకోసం వేధించాడు. దాడి చేశాడు. చివరికి సంతోష్ తన దగ్గర ఉన్న కొడవలి తీసుకొని కీర్యా నాలుక కోశాడు. ఈ దారుణ దాడితో తీవ్ర గాయాలపాలైన కీర్యా రక్తపు మడుగులో విలవిల్లాడుతుండగా.. గమనించిన స్థానికులు వెంటనే మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు