తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలన పరిశీలిస్తే, ఒంగోలుకు చెందిన కబాలి నాగరాజు(26), మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడుకు చెందిన శ్రీవల్లి(21) మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
నాగరాజు తమ అద్దె ఇంటికి సమీపంలోని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి అక్కడే ఉంటున్నారు. శ్రీవల్లి మాత్రం అద్దె ఇంటిలోనే నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం టంగుటూరు మండలం మర్లపాడు దగ్గర చెరువులో ఓ మృతదేహం లభ్యమైంది. తల వెనుక భాగంలో, గొంతుపై గాయాలున్నాయి.
డబ్బు తీసుకుని వస్తానని పోలీసులతో చెప్పి గదిలోకి వెళ్లిన శ్రీవల్లి ఎంతసేపటికీ బయటకు రాలేదు. రమాదేవి లోపలికి వెళ్లేసరికి ఉరికి వేలాడుతూ కనిపించారు. శ్రీవల్లి మృతిపై ఒంగోలు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య, ఆత్మహత్యలకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.