''బిచ్చగాడు'' తమిళం నుంచి తెలుగులోకి డబ్బింగ్ అయి కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. బిచ్చగాడు ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయి కేవలం మౌత్ టాక్తో వంద రోజులు పూర్తిచేసుకుంది. ఈ టాలీవుడ్ మొత్తాన్ని షాక్కి గురిచేసింది. ఈ సినిమాకు సీక్వెల్ రానుందని టాక్ వస్తోంది. రూ.500, రూ.1000 నోట్లు రద్దైన నేపథ్యంలో.. బ్లాక్ మనీ ఆధారంగా బిచ్చగాడు 2ను రూపొందించనున్నట్లు తెలిపింది. ఇందులోనే విజయ్ ఆంటోనీనే హీరోగా నటింపజేయాలనుకుంటున్నారట.
'నకిలీ', 'డాక్టర్ సలీమ్' అనే రెండు చిత్రాల్లో నటించినా రాని గుర్తింపు ఒక్క బిచ్చగాడుతో వచ్చింది. అందుకే బిచ్చగాడు సీక్వెల్కు ప్లాన్ చేస్తున్నారు. బిచ్చగాడు పార్ట్-2లో బ్లాక్మనీ అంశాన్ని టచ్ చేయబోతున్నాడని టాక్. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని సమాచారం. దాదాపు 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళంలోనే కాకుండా మలయాళం, కన్నడలోనూ దీన్ని రిలీజ్ చేయాలని స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. హీరోయిన్ కోసం సంప్రదింపులు జరుగుతున్నాయి.