భోళా శంకర్ డబ్బింగ్ పూర్తయి సురేఖ తో అమెరికా వెళ్లిన చిరంజీవి

శుక్రవారం, 7 జులై 2023 (14:17 IST)
chiranjeevi, sureka
షూటింగ్ కు ముందు, సినిమా పూర్తి అయ్యాక హీరోలు విదేశాలకు వెళ్లటం మామూలే. మహేష్ బాబు, ప్రబాస్, రాంచరణ్, ఎన్.టి. ఆర్. ఇలా వెళ్ళినవారు. ఇప్పడు చిరంజీవి కూడా చేరాడు. నిన్ననే తన సినిమా భోళా శంకర్ డబ్బింగ్ పూర్తి చేశారు.   ఈరోజు యూ.ఎస్. వెళుతున్నట్లు సోషల్ మీడియాలో చిరంజీవి పోస్ట్ చేశారు. 
 
chiranjeevi, sureka
నేను నిర్మిస్తున్న నా తదుపరి, సంతోషకరమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ షూట్‌లో చేరడానికి ముందు రిఫ్రెష్,  పునరుజ్జీవనం కోసం సురేఖతో కలిసి ఒక చిన్న సెలవుదినం కోసం యుఎస్‌కి బయలుదేరాను అంటూ తెలిపారు. 

chiranjeevi, sureka
ఇటీవలే చిరంజీవి మనవ రాలు పుట్టటం, ఆమెకు పేరు పెట్టడం జరిగింది. ఇక భోళా శంకర్ సినిమా చిరంజీవి పుట్టినరోజుకు వారం ముందే విడుదల కాబోతుంది. ఈ సినిమా తమిళ వేదాళం కు రీమేక్. మెహర్ రమేష్ దర్శకుడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు