నడిరోడ్డుపై రౌడీ షీటర్ హత్య జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దుండగుల ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. ఈ హత్య తర్వాత పాత బస్తీలో పోలీసులను అప్రమత్తం చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు.