మంగళవారం తెల్లవారుజామున దినేష్ తండ్రి మృతి చెందాడు. 3 రోజుల క్రితం కరోనాతో దినేష్ తల్లి, బాబాయ్ కన్నుమూశారు. మొత్తానికి ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆ నగరంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మరోవైపు, 'కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ కచ్చితంగా ధరించాలి. లేనివారికి రూ.100 జరిమానా విధించాలి. 1 నుంచి 9 తరగతుల వరకు స్కూళ్లు, హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు మూసివేస్తున్నాం' అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెలిపారు.
కొవిడ్ వ్యాప్తిపై ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. పది, ఇంటర్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
కాగా రోజుకు 310 టన్నుల ఆక్సిజన్ సరఫరాకు ఒప్పందాలు చేసుకున్నామని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26,446 ఆక్సిజన్ బెడ్లకు 347 కిలో లీటర్ల ఆక్సిజన్ అవసరం అవుతుందని తెలిపారు.