పీలేరులో వారాహి అమ్మవారి విగ్రహం పానకం తాగింది.. వీడియో

సెల్వి

మంగళవారం, 16 జులై 2024 (13:00 IST)
జులై 6 నుంచి జులై 15 వరకు వారాహి అమ్మవారి నవరాత్రులు జరిగాయి. ఈ తొమ్మది రోజులూ ఒక్కో రోజు అమ్మవారిని ఒక్కో అలంకారంతో పూజించారు. వారాహి అంటే భూదేవి, ధాన్యలక్ష్మీ అని అర్థం. ఈ వారాహి అమ్మవారు చేతులో నాగలి, రోకలిని ధరించి వుంటుంది. 
 
ఎలాగైతే రోకలి ధాన్యం నుంచి పొట్టును వేరు చేస్తుందో అలాగే వారాహి అమ్మవారు మన జీవితంలో చేసిన కర్మలను మన నుంచి వేరు చేస్తుంది. అన్నమయ్య జిల్లా పీలేరులో వారాహి అమ్మవారి విగ్రహం పానకం తాగింది. అక్కడ బ్రహ్మణ వీధిలో వారాహి అమ్మవారి నవరాత్రుల్లో అమ్మవారు పానకం తాగుతున్న వీడియో వైరల్ అయింది. 
 
ఈ సంఘటన మొత్తం పీలేరులోని శివాలయంలో పూజారి కుమారస్వామి ఇంట్లో జరిగింది. పూజలో భాగంగా అమ్మవారి విగ్రహం ముందు పూజారి పానకాన్ని వుంచారు. 
 
ఆ పానకాన్ని అమ్మవారి విగ్రహం తాగడాన్ని పూజారి భార్య లక్ష్మీ స్వయంగా చూసింది. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో బాగా వైరల్‌గా మారింది. ఈ వింతను చూసేందుకు పూజారి ఇంటికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.

విశాఖప్నంలోని హెచ్‌బీ కాలనీ సింహాద్రిపురంలో ఓ ఇంట్లో పూజలు చేస్తుండగా.. నీళ్లు తాగుతున్న వారాహి అమ్మవారి విగ్రహం. ????#Varahi #varahiAmmavaru pic.twitter.com/BaP8OnixIq

— R (@sa2tii) July 13, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు