ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 326 కొవిడ్ కేసులు

బుధవారం, 3 నవంబరు 2021 (20:50 IST)
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 37,985 పరీక్షలు నిర్వహించగా.. 326 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. గుంటూరులో ఇద్దరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

దీంతో కొవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,386కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 466 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,48,971 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 3,898 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
 
దేశంలో తాజాగా 10,68,514 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,903 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. మందురోజు కంటే కేసులు 14 శాతం మేర పెరిగాయి. గత కొద్ది రోజులుగా కరోనా వ్యాప్తి అదుపులో ఉండటంతో క్రియాశీల, రికవరీ రేట్లు సానుకూలంగా నమోదవుతున్నాయి.

మరోపక్క నిన్న 41,16,230 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 107 కోట్ల మార్కును దాటింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు