వేసవి రద్దీ - తిరుపతికి 8 ప్రత్యేక రైళ్ళు : దక్షిణ మధ్య రైల్వే

ఠాగూర్

బుధవారం, 30 ఏప్రియల్ 2025 (12:15 IST)
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. వేసవిలో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం 8 ప్రత్యేక రైళ్ళను నడుపనున్నట్టు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల కోసం సికింద్రాబాద్ తిరుపతి వయా వికారాబాద్, గుంతకల్ మార్గంలో ఈ స్పెషల్ ట్రైన్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. 
 
మే 8 నుంచి 29వ తేదీ వరకు ప్రతి గురువారం సాయంత్రం 4.30 గుంటలకు చర్లపల్లి నుంచి తిరుపతికి, మే 9 నుంచి మే 30 వరకు ప్రతి శుక్రవారం తిరుపతి నుంచి చర్లపల్లి జంక్షన్‌కు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. 
 
ఈ రైళ్లు సనత్ నగర్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, సెడాం, యాద్గరి, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం, ఆదోనీ, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట్, కోడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు