రౌడీషీటర్ హత్య.. కత్తితో పీక కోసి పరారైనారు.. గొడవలే కారణం..

గురువారం, 18 ఆగస్టు 2022 (10:00 IST)
విశాఖపట్టణంలో రౌడీషీటర్ హత్యకు గురైయ్యాడు. అతడి స్నేహితులే నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే... విశాఖ అప్పుఘర్‌కు చెందిన బి.అనిల్‌కుమార్ (36), ఎంవీపీ కాలనీలోని ఆదర్శనగర్‌కు చెందిన శ్యామ్‌ప్రకాశ్ స్నేహితులు. 
 
అనిల్ కుమార్ రౌడీ షీటర్ కాగా.. శ్యామ్ ప్రకాశ్ బస్సు డ్రైవర్. ఈ ఇద్దరిపై కేసు వుంది. గతంలో ఒకసారి క్రికెట్ ఆడుతున్న సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరగింది. 
 
ఆ తర్వాత రాజీ కుదర్చడంతో మళ్లీ స్నేహితులయ్యారు. కానీ బార్‌లో మద్యం తాగుతూ ఏర్పడిన గొడవలో శ్యామ్ ప్రకాశ్ మరో స్నేహితుడితో కలిసి అనిల్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. కత్తితో అతడి పీక కోసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు.
 
కాగా, అనిల్ కుమార్ తనను తక్కువ చేసి హేళనగా మాట్లాడడాన్ని జీర్ణించుకోలేకే శ్యామ్ ప్రకాశ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. అతడిని హత్య చేసే ఉద్దేశంతోనే బార్‌కు తీసుకెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితుడు శ్యామ్ ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మిగిలిన వారు పరారీలో వున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు