ఇది సీఎం జగన్ కుట్ర: అచ్చెంనాయుడి అరెస్టుపై చంద్రబాబు

శుక్రవారం, 12 జూన్ 2020 (15:20 IST)
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు అచ్చెంనాయుడు అరెస్టుపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. దీనికి సహకరించిన రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరితపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పన్నిన కుట్ర వలన ఈ సంఘటన చోటుచేసుకున్నదని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీపై వైఎస్ఆర్ పార్టీ శత్రుత్వంతో పగ తీర్చుకుంటుందని చంద్రబాబు ధ్వజమెత్తారు.
 
రాష్ట్ర హోంశాఖామంత్రి మేకతోటి సుచరిత స్పందిస్తూ... మందుల కొనుగోలు విషయమై ఆయన అక్రమాలకు పాల్పడ్డారని ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడితే ఎవరినైనా చట్టం శిక్షిస్తుందని ఈ విషయంలో అదే జరిగిందని తెలియజేశారు. అవినీతికి పాల్పడితే అది కేంద్రప్రభుత్వమైనా, రాష్ట్రప్రభుత్వమైనా చట్టం తన పనిని చేస్తుందని వ్యాఖ్యానించారు.
 
అచ్చెంనాయుడ్ని తమ నివాసమైన శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ అధికారులు ఈ రోజు ఉదయం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని ఏసీబి ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై తెదేపా నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు