ఆళ్లగడ్డ శాసన సభ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా దివంగత మహిళా నేత భూమా శోభా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియను ఖరారు చేశారు. గత ఎన్నికల సమయంలో శోభానాగిరెడ్డి ప్రచారం ముగించుకుని వస్తున్న సమయంలో కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఐతే ఆళ్లగడ్డ ఎన్నికలో అఖండ విజయాన్ని మరణించాక కూడా శోభకే ఓటర్లు కట్టబెట్టారు.