ఆంధ్రా డేటాపై తెలంగాణ పోలీసులు కేసా? వాళ్లెవరు? సీఎం చంద్రబాబు

సోమవారం, 4 మార్చి 2019 (20:52 IST)
ఓట్ల గల్లంతు వ్యవహారం మలుపులు తిరుగుతోంది. డేటా చోరీ అంటూ తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు అందటంతో వారు ఏపీకి చెందిన పలు ఐటీ కంపెనీలపై టార్గెట్ చేసి తనిఖీలు చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ట్విట్టర్లో ఆయన ట్వీట్ చేస్తూ... " డేటా పేరుతో దాడులు చేస్తే చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నారేమో, డేటా అనేది పార్టీ వ్యక్తిగత విషయం. అందులో తలదూర్చితే మీ అందరి మూలాలు కదులుతాయి. మీరు చేస్తోన్న నేరాలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది జాగ్రత్త.
 
ఆంధ్రప్రదేశ్ డేటాపై కేసులు పెట్టేందుకు తెలంగాణ పోలీసులు ఎవరు? ఎవరో దారిన పోయిన దానయ్య ఫిర్యాదు చేస్తే, డేటా ఉంది కదా అని ఇక్కడి ఐటీ కంపెనీలపై దాడి చేస్తారా? ఆంధ్రప్రదేశ్‌పై కుట్రలు చేస్తూ తెలంగాణ పోలీసులు కాపాడతారని డ్రామాలు చేస్తారా?" అని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు