ఏపీ మంత్రి రోజా ఇంట భోగి పండుగ.. నెట్టింట వీడియో వైరల్

శనివారం, 14 జనవరి 2023 (11:30 IST)
ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమ శాఖ మంత్రి ఆర్కే రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో రోజాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు భోగి మంటలకు నిప్పు పెట్టడంతో పాటు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 
 
ఈ విజువల్స్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఈ వీడియోను చూసిన రోజా ఫ్యాన్స్ ఆమెకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సంబరాలలో రోజా వున్నప్పటికీ, ఇటీవల మెగా కుటుంబంపై ఆమె చేసిన వ్యాఖ్యల కారణంగా మంత్రి రోజా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు