ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల మేరకు... డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లతో పాటు ఇతర కేడర్లలోని ఉద్యోగులకు త్వరలోనే పదోన్నతలు కల్పించనున్నారు. గతంలో వారిపై నమోదైన క్రమశిక్షణా చర్యలు, శిక్షలు లేదా పెనాల్టీలతో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కాకముందు ఇదే విధానం అమల్లో ఉండేది.
2020లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు వర్తించే నిబంధనలనే ఆర్టీసీ సిబ్బందికి కూడా అమలు చేశారు. దీంతో పదోన్నతుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పాత విధానాన్నే కొనసాగించాలని ప్రభుత్వ సంఘాలు చాలాకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.