పబ్లిసిటీ కోసం వర్మను ఫాలో అవుతున్న ఉండవల్లి : సుధీర్ రాంబొట్ల

ఆదివారం, 31 జనవరి 2021 (08:53 IST)
పబ్లిసిటీ కోసం ఉండవల్లి అరుణ్ కుమార్ రామ్‌ గోపాల్‌వర్మను ఫాలో అవుతున్నారని బీజేపీ సీనియర్ నేత సుధీష్ రాంబొట్ల ఎద్దేవ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై ఉండవల్లి అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉండవల్లి అంటే మేధావి అనుకున్నాం. ఉండవల్లి చెప్పిన పుస్తకాల్లో అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. 
 
ఉండవల్లికి హిందూ మతం గురించి తెలియక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. స్వామి వివేకానంద, అంబేద్కర్ వ్యాఖ్యలను తప్పులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, కమ్యునిస్ట్ పార్టీలకు వితండవాదం ఎక్కువని చెప్పారు. ఉండవల్లి వ్యాఖ్యలను ఖండించకపోతే‌ దేశ భద్రతకే‌ ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. ఉండవల్లి ఆర్ఎస్ఎస్, బీజేపీపై అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకొనేది లేదని సుధీష్‌ రాంభొట్ల హెచ్చరించారు. 
 
వివేకానంద, అంబేడ్కర్ రచనలుని వక్రీకరించారు. ఈ అంశాలపై బహిరంగ చర్చకు ఉండవల్లి రావాలని లేదా ఆయన ఎక్కడ పెడితే అక్కడకు నేను వస్తానని సవాల్ విసిరారు. 
ముఖ్యంగా మతం మారేవారందరు దళితులే అన్ని ఉండవల్లి చేప్పుకొచ్చారు రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి, రాబర్ట్ వాద్రా, అహ్మద్ పటేల్‌లు కూడా మతం మారారు. మరి వారందరూ దళితులేనా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు బిట్ర వెంకట శివన్నారాయన పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు