వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

సెల్వి

శనివారం, 29 మార్చి 2025 (19:08 IST)
టిఫిన్ సెంటర్లో వేడివేడి బజ్జీలు తీసుకొచ్చిన ఓ వ్యక్తి షాక్ అయ్యాడు. తూర్పు గోదావరి జిల్లాలో మరో హోటల్ నిర్లక్ష్యం బట్టబయలైంది. అక్కడ వేడి వేడి బజ్జీలు తీసుకుని ఇంటికి వచ్చాడు. పొట్లం ఓపెన్ చేసి బజ్జీ తింటుండగా.. ఒక్కసారిగా అవాక్కయ్యాడు. బజ్జీలో పదునైన బ్లేడ్ కనిపించడంతో ఆ యువకుడికి దిమ్మతిరిగిపోయింది. కొంచెం ఉంటే ఆ బ్లేడ్ కడుపులోకి పోయి పేగుల్లోకి వెళ్లేవి. ప్రస్తుతం అందుకు సంబంధించిన సంఘటన వైరల్ కావడంతో నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. దేవరపల్లి మండలం యర్నగూడెంకు చెందిన హోటల్‌లో ఈ  నిర్వాకం బయటపడింది. 
 
కాగా హోటళ్లు, రెస్టారెంట్లలో అపరిశుభ్రత విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కువగా లాభాలు సంపాదించాలనే దురుద్దేశంతో కొందరు నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. ఇప్పటి వరకు అన్నం, బిర్యానీ, కూరల్లో.. సిగరెట్‌లు, పరుగులు, ఎలుకలు వంటివి చూసుంటారు. ఇక ఇప్పుడు బజ్జీలో బ్లేడ్ రావడంతో బయట ఫుడ్ తినాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు