శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పేలిన నాటు బాంబులు.. ప్రాణాలు కోల్పోయిన...

గురువారం, 1 ఏప్రియల్ 2021 (11:22 IST)
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నాటు బాంబులు పేలాయి. గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. రెండు నాటు బాంబులు పెద్ద శబ్దంతో పేలాయి. యూనివర్సిటీ ఆవరణలోని ఐ బ్లాక్ సమీపంలో ఈ  పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ శునకం, వరాహం మృతి చెందాయి. 
 
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న క్యాంపస్ పోలీసులు ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఇంకేమైనా బాంబులు ఉన్నాయేమోనని క్షుణ్ణంగా గాలించారు. 
 
అయితే, అడవి పందులను వేటాడేందుకే బాంబులను అక్కడ పెట్టినట్టు గుర్తించిన పోలీసులు ఇద్దరు వేటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యూనివర్శిటీ ప్రాంగణంలో ఈ బాంబులు పేలడంతో ప్రతి ఒక్కరూ ఉలిక్కిపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు