రాజకీయంగా ఎదుగుతుందని ఇదంతా చేస్తున్నారు: దివ్వెల మాధురి భర్త

సెల్వి

మంగళవారం, 13 ఆగస్టు 2024 (16:13 IST)
Divvala Madhuri
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి, దువ్వాడ వాణిల వ్య‌వ‌హారంపై అమెరికాలో ఉంటున్న మాధురి భ‌ర్త దివ్వెల మ‌హేశ్ చంద్ర‌బోస్ తాజాగా స్పందించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. త‌న‌కు రాజ‌కీయాలంటే ఇష్టం లేదని.. మాధురి ఇష్ట‌ప‌డ‌టంతో వైసీపీలోకి వెళ్ల‌డానికి మ‌ద్ద‌తు ఇచ్చాన‌ని తెలిపారు. 
 
త‌న భార్య‌పై త‌న‌కు పూర్తి న‌మ్మ‌కం ఉంద‌ని, ఆమె రాజ‌కీయంగా ఎదుగుతుంద‌నే కావాల‌ని ఈ ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే.. త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసుకుని త‌న‌పై ట్రోలింగ్ చేస్తున్నారనే మ‌న‌స్తాపంతో ఆగి ఉన్న కారును త‌న కారుతో ఢీకొట్టి ఆత్మ‌హత్యాయ‌త్నం చేశారు మాధురి. ప్రస్తుతం ఈ ప్రమాదంతో గాయపడిన మాధురి ఆస్పత్రి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు